15-06-2025 07:57:43 PM
పటాన్ చెరు: మండల కేంద్రం జిన్నారంలోని ఎస్సీ బస్తీలో నిర్మిస్తున్న పోచమ్మ ఆలయానికి జిన్నారం మాజీ జెడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి(former ZPTC Kolan Balreddy) ఆదివారం విరాళం అందజేశారు. బొల్లారంలోని తన నివాసంలో ఆలయ కమిటీ సభ్యులకు రూ. 1,01,116 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశం గౌడ్, జిన్నారం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ గౌడ్, ఏర్పల లింగం, బ్రహ్మేందర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, అంజిరెడ్డి, నిఖిల్ గౌడ్, నర్సింగరావు, రాము, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.