15-06-2025 07:54:42 PM
డిహెచ్ పి ఎస్ రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయండి...
డిహెచ్ పి ఎస్ నల్గొండ జిల్లా ఇంచార్జి బొలుగురి నర్సింహా..
మునుగోడు (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డి హెచ్ పి ఎస్ నల్గొండ జిల్లా ఇంచార్జి బొలుగురి నర్సింహా(DHPS District Incharge Boluguri Narasimha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నందిపాటి అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన డి హెచ్ పి ఎస్ మండల మహాసభలో పాల్గొని మాట్లాడారు.
దేశంలో బీజేపీ అధికారలోకి వచ్చిన తరువాత దళితులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని, రాజ్యాంగన్ని రద్దు చేసి మణుధర్మ శాస్త్రన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేసి రిజర్వేషన్స్ రద్దు చేయాలని చూస్తుందని అన్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తుందని,ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం పేదలకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టి పథకాన్ని రద్దు చేయడానికి చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వచ్చి 18 నెలలు అవుతున్న చేవెళ్ల డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు..రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ గురుకులాలను రద్దు చేయడానికి కుట్రలు చేస్తుందని అన్నారు.
దళిత హక్కుల పోరాట సమితి రెండవ రాష్ట్ర మహాసభలు జులై 7, 8 తేదీల్లో పి ఆర్ ఆర్ ఏ సి కన్వెన్షన్ హాల్, హంటర్ రోడ్ వరంగల్ లో జరిగే మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 350 మంది ప్రతినిధులు పాల్గొని దేశవ్యాప్తంగా రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించి భవిష్యత్తు పోరాటాలను రూపొందించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డి హెచ్ పి ఎస్ జిల్లా కన్వినర్ గోసుకోండ లింగయ్య,సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,బోయపర్తి యాదయ్య, పందుల కుమార్, మేడి చంద్రయ్య, ఏర్పుల నగేష్, గోసుకోండ మారయ్య, గడ్డం నరేష్, మేడి ముత్తయ్య, బెల్లం శివయ్య, ముత్తయ్య, దుబ్బ వెంకన్న, ఇరిగి జయమ్మ ఉన్నారు.