బొప్పస్పల్లిలో ఆంజనేయస్వామి ఆలయానికి శంకుస్థాపన
రామ్ రామ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు సన్నాహాలు వేగం
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు నాయకుల ఆహ్వానం
బాన్సువాడ,(విజయక్రాంతి): ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి బాన్సువాడ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ ను మంగళవారం నిజామాబాద్ లోని ఆయన స్వగృహంలో నసురుల్లాబాద్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పస్పల్లి గ్రామంలో ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు నిర్వహించనున్న ఆంజనేయస్వామి గుడి శంకుస్థాపనతో పాటు లంబాడీల ఆరాధ్య దైవం రామ్ రామ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు టేకర్ల సాయిలు, లక్ష్మణ్, చౌహాన్, దొంతి భాస్కర్, మామిడి భూమయ్య, కేతావత్ బాబు, మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.




