15-10-2025 12:00:00 AM
-జిల్లాలకు ఎల్లో అలెర్ట్
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ సూచించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని, గంటకు 30 వేగంతో గాలులు సైతం వీస్తాయని తెలిపింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.