15-06-2025 01:20:27 PM
ప్రయాగ్రాజ్: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్(Prayagraj) సోన్వర్ష హల్లాబర్ గ్రామంలో పిడుగుపాటుకు(lightning strike) గురై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి కుటుంబం తమ గడ్డి ఇంట్లో నిద్రిస్తుండగా ఈ సంఘటన జరిగిందని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వినీతా సింగ్ తెలిపారు. మృతులను వీరేంద్ర వనవాసి, ఆయన భార్య పార్వతి, కుమార్తెలు రాధ, కరిష్మగా గుర్తించారు. మృతుల వయస్సు ఇంకా నిర్ధారించలేదని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపినట్లు సింగ్ తెలిపారు.
ప్రయాగ్రాజ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కుంజ్ లత మాట్లాడుతూ, "జూన్ 15 రాత్రి, తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో, బారాలోని సోన్బార్సా గ్రామంలో ఒక సంఘటన జరిగింది, పిడుగుపాటు కారణంగా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సోన్బార్సా, బారా పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు" అని లత పేర్కొన్నారు.