24 March, 2026 | 3:50 PM

వారణాసికి వెళ్తూ అనంతలోకాలకు

28-11-2025 01:43 PM

మీర్జాపూర్‌లో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి 

మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో(Mirzapur) శుక్రవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కట్కా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. ప్రయాగ్‌రాజ్ నుండి వారణాసికి(Prayagraj to Varanasi) వెళ్తున్న కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు దాటుతున్న ఇద్దరు పాదచారులను ఢీకొట్టి, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టాడని సర్కిల్ ఆఫీసర్ అమర్ బహదూర్ సింగ్ తెలిపారు. కారు ఢీకొట్టడంతో పాదచారులు మీటర్ల దూరం ఎగిరిపడ్డారని బహదూర్ సింగ్ తెలిపారు.