20-06-2025 12:00:00 AM
సాయిరాం హాస్పిటల్ లో ఘనంగా వరల్ కిడ్నీ క్యాన్సర్ డే అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ వైద్య కళాశాల మెడికల్ సూపరిండెంట్ కిరణ్ కుమార్
ఖమ్మం జూన్ 19 (విజయక్రాంతి)క్యాన్సర్ మహమ్మారిలా మారి ప్రాణాంతకం కాకముందే గుర్తించి చికిత్స పొందడం ద్వారా ప్రాణాపాయ పరిస్థితి తప్పుతుందని ఖమ్మం జి జి హెచ్, ప్రభుత్వ వైద్య కళాశాల మెడికల్ సూపరింటిడెంట్ కిరణ్ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం లో మొట్ట మొదటి ఫ్రీ క్యాన్సర్ సెకండ్ ఒపీనియన్ క్లినిక్, ఈఎంఐ ఫెసిలిటీ, ఫీవర్ క్లినిక్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతం లో అంటువ్యాధులు చాలా ఎక్కువగా ఉండేవి, ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టి, క్యాన్సర్ సంబంధిత వ్యాధులు అధికమయ్యాయి అన్నారు. ప్రపంచ కిడ్నీ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సాయిరాం హాస్పిటల్ ప్రాంగణంలో కిడ్నీ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కిడ్నీ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు గుర్తింపును ప్రోత్సహించడం, రోగులు వారి కుటుంబాలకు నిపుణుల సంప్రదింపుల ద్వారా మద్దతు అందించడం లక్ష్యంగా ఏ కార్యక్రమాన్ని నిర్వ హించారు. డాక్టర్ సునీల్ కుమార్ జంగాల ఆధ్వర్యంలో సాయిరాం హాస్పిటల్ వైద్య నిపుణులు కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు, ప్రమాద కారణాలు, నివారణ, చికిత్స గురించి సమాచారాన్ని అందించారు.
ఖమ్మం లో మొట్టమొదటిసారిగా ఫ్రీ క్యాన్సర్ సెకండ్ ఒపీనియన్ క్లినిక్ ను అందు బాటులోకి ఎవరైతే క్యాన్సర్ నిర్ధారణ పై సందేహాలు ఉంటే ఉచితంగా సాయిరాం హాస్పిటల్ క్యాన్సర్ సెకండ్ ఒపీనియన్ క్లినిక్ లో సందర్శించవచ్చు వేటుతో పాటు చికిత్స ఖర్చులను సులభమైన రాయితీలో చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి రాబోయే వర్షాకాలంలో జ్వరాలు ఇన్ఫె క్షన్ నిర్ధారణ కోసం ప్రత్యేక ఫీవర్ క్లినిక్ ను అందుబాటులో ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ స్వాతి జంగాల, డైరెక్టర్ శ్రీధర్ జంగాల, సీఈవో డాక్టర్ వెంకటేష్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విజేష్ వర్మ, సర్జికల్, ఆంకాలజిస్ట్, డాక్టర్ వెంకటేష్ పున్న,డాక్టర్ త్రిశూల్రెడ్డి పాల్గొన్నారు.