20-06-2025 12:00:00 AM
కార్వాన్, జూన్ 19: గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం హుం డీని అధికారులు గురువారం లెక్కించారు. మూడు నెలలకు సంబంధించి న హుండీని లెక్కించగా రూ. 85,080 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం ఆలయ ట్రస్ట్ చైర్మన్ చంటి బాబు, ఈవో వసంత మాట్లాడుతూ.. బోనాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సర్వేశ్, సురేష్ చారి, వృత్తి పనివారి సంఘం అధ్యక్షులు తంగడపల్లి శివశంకర్, పటేల్ శంకర్, సుధీర్, ఈశ్వర్ ప్రసాద్, బి. నవీన్, రాజు, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.