20-06-2025 12:48:12 AM
కాఫీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు..
వెంకటాపురం నూగూరు, జూన్ 19 (విజయ క్రాంతి): వెంకటాపురం మండలం నూగురు కాలనీ గ్రామంలో కుల, మతాల గురించి అవగాహన కల్పించే సదస్సు కాఫెడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూగురు పంచాయతీ సెక్రెటరీ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ కుల, మతాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా, కుల, మతాల మధ్య ఉన్న అంతరాలు, వివక్షతలను తొలగించడానికి అవగాహన కల్పించడం జరుగుతుంది అన్నారు.
కుల, మతాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. కుల, మతాల మధ్య ఉన్న అంతరాలు, వివక్షతలను తొలగించడానికి అవగాహన అవసరమన్నారు. కుల, మతాల మధ్య సయోద్యత, సహనం నెలకొల్పడం.కుల, మతాల పట్ల ఉన్న అపోహలను, మూఢనమ్మకాలను తొలగించడం.కుల, మతాల ఆధారంగా వివక్షతలకు గురవుతున్న ప్రజలు తెలుసుకోవాలని తెలిపారు. కుల, మతాల వల్ల సమాజంలో కలిగే సమస్యలు. కుల, మతాల మధ్య సమన్వయం ఉండాలని, కుల, మతాల ఆధారంగా వివక్షతకు గురవుతున్న ప్రజలు ఎక్కువగా తెలుసుకోవాలని సూచించారు.
కుల, మతాల పట్ల ఉన్న అపోహలు, మూఢనమ్మకాలను ఎలా తొలగించుకోవాలని తెలపడం కోసం ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కుల, మతాల అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా సమాజంలో కుల, మతాల మధ్య సమన్వయం, సహనం నెలకొల్పడానికి సహాయపడుతుంది అన్నారు. కుల, మతాల ఆధారంగా వివక్షతలకు గురవుతున్న ప్రజలు ఎక్కువగా తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి వెంకటాపురం మండల కోఆర్డినేటర్ హనుమంతు, వాజేడు మండల కోఆర్డినేటర్ కామేష్ యానిమేటర్స్ ఉషా, ఇందిరా, పద్మ, నరేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.