24-06-2025 01:34:52 AM
చొరవ చూపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కడెం మండలానికి చెందిన లింగాపూర్ వాసులు రాచకొండ నరేష్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మున్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్లు మలేషియా జైలు జీవితం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో బయటపడ్డారని ఆయన కార్యాలయం ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది.
మలేషియా జైలులో అన్యాయంగా మగ్గిన ఆరుగురు బాధితుల్లో సోమవారం మరో ముగ్గురు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇంతకు ముందు గత నెలలో ముగ్గురు బాధితులు తిరిగి రావడం, ఇప్పుడు మరో ముగ్గురు స్వదేశానికి చేరుకోవడంలో కేటీఆర్, ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి భూక్యా జాన్సన్ నాయక్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లుగా తెలిపారు.