calender_icon.png 24 June, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీగా ‘బండి’ గెలవడమే శాపం

24-06-2025 01:34:05 AM

-బ్రిడ్జి కట్టడం చేతగాని సంజయ్ కాళేశ్వరంపై మాట్లాటం హాస్యాస్పదం

-బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల, పాడి కౌశిక్, సంజయ్, ఎమ్మెల్సీ శ్రవణ్

హైదరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): కరీంనగర్ ఎంపీగా సంజయ్ గెలవడమే ఓ శాపమని, ఓ బ్రిడ్జి కూడా కట్టడం చేత కాని బండి సంజయ్ కాళేశ్వరం లాంటి పెద్ద ప్రా జెక్టు గురించి మాట్లాడతారా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీ డియా సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కమలాకర్, కల్వకుంట్ల సంజ య్ మాట్లాడారు. కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తు న్నారని కమలాకర్ విమర్శించారు.

లక్ష కోట్లలోపే ఖర్చయిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందనడం బండి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. బండి సంజయ్ బీజేపీనా.. లేక కాంగ్రెస్ పార్టీనా అర్ధం కావడం లేదని, రేవంత్ రాసిచ్చిన స్క్రి ప్ట్‌ను చదువుతున్నారని ఆరోపించారు. బండి, ధర్మపురి అరవింద్ చిల్లర రాజకీయా లు చేస్తున్నారని  మండిపడ్డారు.  సీడబ్ల్యూసీ రిపోర్ట్‌ను వక్రీకరించిన బండి సంజయ్ కేం ద్ర మంత్రి పదవిలో కొనసాగే హక్కు లేద న్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగితే ఈటల రాజేందర్‌ను కూడా పిలవాల్సి ఉం టుందని, పిలిస్తే రాజేందర్‌కు బీజేపీ అధ్యక్ష పదవి రాదని బండి సంజయ్ కుట్ర అని ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ ఆరోపించారు.