21-12-2025 05:21:35 PM
స్నేహితుని కుటుంబానికి 74,000 వేల ఆర్థిక సాయం అందజేత...
2001-2002 పదవ తరగతి బ్యాచ్ యరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు
మర్రిగూడ,(విజయక్రాంతి): మండలంలోని అజిలాపురం గ్రామానికి చెందిన మాధగోని వెంకటేష్ నవంబర్ 8న రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటివద్ద ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మృతినందాడు. మృతునికి భార్య ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వెంకటేష్ తో పాటు పదవ తరగతి విద్యను అభ్యసించిన 2001-2002 పదవ తరగతి బ్యాచ్ యరగండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్లాస్ మెంట్స్ అందరూ కలిసి 74 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆదివారం అజిలాపురం గ్రామంలో కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వెంకటేష్ చిత్రపటానికి స్నేహితులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అతనికి ఉన్న స్నేహబంధాన్ని తలచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. వెంకటేష్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఉప్పునూతల కృష్ణయ్య, రొక్కం మసూదన్ రెడ్డి, వెంకట్ బాబు, సిద్ధపురం జంగయ్య, వల్లముల శ్రీను, నారోజు రామాచారి, రమేష్,శ్రీను,కొండల్, రజాక్ తదితరులు పాల్గొన్నారు.