03-12-2025 12:40:59 AM
-5లోగా పనులు పూర్తి చేయాలి
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
- ఫ్యూచర్ సిటీలో పనుల పరిశీలన
-అధికారులకు దిశా నిర్దేశం
రంగారెడ్డి, డిసెంబర్ 2 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు మంగళవారం పరిశీలించారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనుంది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్పై మంత్రి శ్రీధర్బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 5వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేయాలని, 6వ తేదీన డ్రై రన్ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచనలు ఇచ్చారు. దేశాలు, రాష్ట్రాల నుం చి వచ్చే డెలిగేట్స్, అతిథులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పా రు.
పార్కింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికా రులకు సూచించారు. ఆయనవెంట ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రాంరెడ్డి, ఆర్ అండ్ బి స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటి కమిషనర్ శశాంక, రాచకొండ కమీషనర్ సుధీర్ బాబు, ప్రోటోకాల్ సెక్రటరీ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.