13-09-2025 06:59:32 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎల్ఐసీ యూనియన్ భవన నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా రూ.5 లక్షలను మంజూరు చేసినట్టు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మంజూరైన ప్రోసిడింగ్ పత్రాన్ని యూనియన్ సభ్యులకు అందజేశారు. నిధులను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారికి యూనియన్ సభ్యులు శాలువాతో సత్కరించారు.