15 June, 2026 | 10:17 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

భారీగా గంజాయి సాగు

13-09-2025 07:01 PM

ఎక్సైజ్ అధికారులపై అనుమానాలు 

జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గా గ్రామంలో వ్యవసాయ భూమిలో అంతర పంటలో భాగంగా గంజాయి సాగు చేస్తున్నట్టు విశ్వసినియ సమాచారం మేరకు ఎక్సెజ్ పోలీసులు, రెవిన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వీరేశం అనే రైతు తన వ్యవసాయ భూమిలో కంది, సోయా పంటలు సాగు చేసుకుంటున్నాడు. అదేవిధంగా ఆ పంటల్లోనే అంతర పంటగా 147 గంజాయి మొక్కలను పండించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి స్థానికులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం ఎక్సైజ్ అధికారులకు తెలుపగా వారు రెవిన్యూ సిబ్బందితో కలిసి ఒక్క సంవత్సరం మేరకు ఆ రైతు యొక్క భూమిలో పరిశీలించి గంజాయి మొక్కలను ధ్రువీకరించారు. అయితే ఈ విషయంపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరేశం అనే రైతు గంజాయి సాగు చేస్తున్న రైతు విషయం ఆప్కారి అధికారులకు ముందే తెలిసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

గ్రామస్తులు చెప్పేంతవరకు వారు పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో  కొన్నేళ్ళ క్రితం పెద్దగుల్లా, కౌలాస్, వజ్రకండి గ్రామ శివారులో కూడా వ్యవసాయ భూమిలో పత్తి పంటలో అంతర పంటగా భారీగా గంజాయి సాగు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కూడా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో అటవీ ప్రాంతాల వ్యవసాయ భూములలో, ఎకరాల పరిధిలో వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేస్తున్నారని తెలిసిన ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలువురు పలు విధాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ గంజాయి పట్టుకున్న వారిలో బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ, జుక్కల్ తహసిల్దార్ మారుతి, ఆర్ ఐ రామ్ పటేల్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.