సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆశీస్సులతో సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలోని ఊరు పెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయుటకు రూ.8 కోట్ల 77 లక్షల 50 వేల నిధులు విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్పు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో శనివారం వారి చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత , జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,




