30 August, 2026 | 8:29 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

మధిరలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.128 కోట్ల నిధులు విడుదల

09-06-2024 04:47 PM

ఖమ్మం : జిల్లాలోని మధిర క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గ అభివృద్ధిపై మున్సిపల్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధిరలో అండర్ డ్రైనేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.128 కోట్ల నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం మధిరను దేశంలో నంబర్.1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసింది. ఇకా అధికారులు నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు హామీలు ఇచ్చామని, అధికారులు జవాబుదారీ తనంతో పనిచేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.