13-06-2025 10:00:45 PM
కోదాడ: ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలిగించేలా రోడ్లపై స్టంట్ లు, రిల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ శివ శంకర్ నాయక్ హెచ్చరించారు. గురువారం స్టంట్ రీల్స్ చేస్తున్న కొంతమంది యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనదారులను ప్రజలను భయపెట్టేలా స్టంట్ లతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. మరోసారి ఇటువంటివి ఘటనలు పునరావృతమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.