మే 31న ‘గం.. గం..గణేశా’

30-04-2024 12:05:00 AM

‘బేబి’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నుండి ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా ‘గం..గం.. గణేశా’. ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్‌లోనే చేస్తున్న తొలి యాక్షన్ మూవీ ఈ చిత్రమని, సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని  మే 31న  విడుదల చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్థస్త్ ఇమాన్యూయల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి.