calender_icon.png 30 September, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 2న గాంధీ జయంతి పాటించాలి

30-09-2025 12:20:37 AM

  1. వధశాలలు, మాంసం దుకాణాలు మూసేయాలి
  2. జీహెచ్‌ఎంసీ ఆదేశాలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎద్దులు, గొర్రెలు, మేకల వధశాలలు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలు అక్టోబర్ 2న మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ చట్టం1955లోని విభా గం 533 (బి) ప్రకారం, 2025 సెప్టెంబర్ 24న జరిగిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన 172వ తీర్మా నం ఆధారంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల అమలు కోసం సంబంధిత అధికారులందరూ సహకరించాలని, మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టి గాంధీ జయంతి పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది.