11-09-2024 12:00:00 AM
న్యూఢిల్లీ: హాంగ్ కాంగ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత జోడీ గాయత్రి గోపిచంద్- త్రిసా జాలీ ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టారు. తొలి రౌండ్లో గాయత్రి ద్వయం 21-14, 21-13తో పొలినా-కాంటెమెర్ (ఉక్రెయిన్)పై సునాయాస విజయాన్ని సాధించారు. మరో డబుల్స్ మ్యాచ్లో రుతుపర్ణ-శ్వేతపర్ణ జోడీ 11-21, 8-21తో షాన్- హుంగ్ జు (చైనీస్తైపీ) చేతిలో పరాజయం చవిచూసింది. ఇక పురుషుల సింగిల్స్లో చిరాగ్ సేన్, మానవ్ చౌదరి క్వార్టర్స్లో వెనుదిరిగారు. క్వార్టర్స్లో చిరాగ్.. గ్జియాడాంగ్ చేతిలో పరాజయం చవిచూడగా.. మానవ్.. చన్ యిన్చేతిలో ఓటమి పాలయ్యాడు.