12 June, 2026 | 4:57 PM

Breaking News

శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •   యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధులను మంజూరు చేయండి   •   ఖమ్మం పోలీస్ కమిషనర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు   •   పిల్లల చేతుల్లో పనిముట్లు కాదు,పుస్తకాలు ఉండాలి   •  

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం

25-11-2025 10:33 AM

హైదరాబాద్: మంగళవారం నాడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం(GHMC Council meeting) జరగనుంది. కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై వాడీవేడీగా చర్చ జరగనుంది. మొత్తం 46 ఎజెండా అంశాలపై కౌన్సిల్ చర్చించనున్నట్లు సమాచారం. కౌన్సిల్ సమావేశానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి కార్పొరేటర్లతో నిన్న కేటీఆర్ సమావేశం అయ్యారు. కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పై కార్పొరేటర్లకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 

పలు అంశాలపై నిరసనలు తెలిపేందుకు బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ప్రభుత్వ భూముల అమ్మకంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిలదీయనున్నారు. దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి  సమావేశానికి బీజేపీ కార్పొరేటర్లు సమావేశానికి హాజరుకానున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi) అధ్యక్షతన కౌన్సిల్ చివరి సమావేశం కావడం విషయం. 2026 ఫిబ్రవరి 11తో జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ముగియనుంది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.