15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వార్డుల పెంపుపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ సిద్ధం చేశాం

16-12-2025 11:33 AM

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం(GHMC Special Council Meeting) ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. కౌన్సిల్ సమావేశంలో వార్డుల విభజనపై చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan) మాట్లాడుతూ... వార్డుల సంఖ్య పెంపుపై ప్రిలిమినరీ నోటిఫికేషన్ సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు. సరిహద్దులు, తదితర వివరాలు జీవో 266లో పొందుపరిచామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పెంపుపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. వార్డుల పెంపుపై అభ్యంతరాల స్వీకరణ రేపటితో ముగుస్తోందన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల(GHMC wards) సంఖ్యను ప్రభుత్వం 300కు పెంచిందని  జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.