calender_icon.png 26 September, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారును ఢీకొట్టిన లారీ... బాలిక మృతి

25-09-2025 10:44:07 PM

నకిరేకల్,(విజయక్రాంతి): అగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో బాలిక మృతిచెందింది. ఈ సంఘటన గురువారం మండలంలోని ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని జాతీయ రహదాలపై చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని చీమలగడ్డకు చెందిన కందుల రుతు ఝాన్సీ ఆమె కుమార్తె లవీనతో పాటు మనుమరాళ్లు రెముడాల అద్వితీ రియా. ఎండి. అరీనలు కారులో హైదరాబాద్ లోని కూమారుడి వద్దకు బయలుదేరారు.

మార్గమద్యంలోని ముత్యాలమ్మగూడెం శివారులోని గచ్చుగూరి చెరువు వద్దకు రాగానే కారు టైరు పంచర్ అయ్యింది. డ్రైవర్ ఏర్పుల సామేలు కారును రహదారి పక్కన నిలిపి టైర్ మార్చుతున్న క్రమంలో రుతు ఝాన్సీ, లవీన, ఎండి. అరీనలు కిందికి దిగి పక్కకు నిలబడ్డారు. అద్వితీ రియా (14) మాత్రం కారు ముందు నిలుచుంది. అదే క్రమంలో కోదాడు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ అగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టారు.

ప్రమాదంలో కారు ముందు నిలుచున్న అద్వితీ రియాకుతీవ్రగాయాలయ్యాయి. వెంటనే నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లాగా చిక్సిత పొందుతూ మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి తాత లాజరస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.