13-11-2025 12:00:00 AM
వరంగల్ ఎంపీ కడియం కావ్య
ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు,కలక్టర్ రాహుల్ శర్మ
రేగొండ/భూపాలపల్లి,నవంబర్ 12(విజయక్రాంతి): కిషోర్ బాలికలు మెనుస్ట్రూ అం డ్ ఐజనిక్ పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురా లు డాక్టర్ కడియం కావ్య తెలిపారు.బుధవా రం మైలారం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో గివ్ ఫర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ఉచిత సానిటరీ నాప్కిన్స్ పంపి ణీ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గం డ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రా హుల్ శర్మతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సం దర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడు తూ రుతుస్రావ సమస్య వల్ల బాలికలు డ్రా ప్ అవుట్స్ అవుతున్నారని తెలిపారు. ఆరో గ్యం విద్యా వికాసం పై వైద్యురాలిగా గతం లో సేవలు అందించినట్లు తెలిపారు. 2016 నుండి బాలికలకు సానిటరీ నాప్ కిన్స్ ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించానని అన్నా రు.మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశా రు.ఆరోగ్యంపై బాలికలకు మహిళలకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపా రు. రుతు స్రావ సమస్యను ఎలా ఎదుర్కొవాలో కిషోర బాలికలు రాబోవు తరాలకు తె లియజేయాలని సూచించారు.
అవగాహన చాలా ముఖ్యమని తెలిపారు.మెనూస్ట్రల్ సమస్య ఉందని అనుకోవద్దని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నాప్ కిన్స్ అందచేసిన ఫర్ గివ్ సం స్థ సత్యను అభినందించారు.తన నిధుల నుండి 60 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక సంక్షేమ పథకాలకు ని ధులు తెస్తున్న భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ రావును ఈ సందర్భంగా ఆమె అభినందించారు.
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మా ట్లాడుతూ విద్యాభివృద్ధికి అవసరమైన నిధు లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 200 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.విద్యార్థులు క్రీడాకారులు గా, విద్యావేత్తలుగా ఎదిగి ఈ ప్రాంతానికి, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.
బాలికలు వ్యక్తిగత పరి శుభ్రత పాటించాలని తెలిపారు. ఈ పాఠశాలకు అవసరమైన సిసి కెమెరా, క్రీడా మైదా నం, ప్రహరి గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు ఋతుస్రావ సమస్యను ధైర్యం గా ఎదుర్కొనే విధంగా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మ హిళా సంక్షేమ అధికారిని మల్లేశ్వరి, పాఠశా ల ప్రిన్సిపల్ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టప్ప, గివ్ ఫర్ సొసైటీ సంస్థ అధ్యక్షులు సత్య, కో ఆర్డినేటర్ శిరీష,తదితరులు పాల్గొన్నారు.