01-05-2025 01:10:09 AM
డివిజన్ లోనే ప్రథమ స్థానం, జిల్లాలో రెండో స్థానం
వాచేపల్లి భువన శ్రీకి 584 మార్కులు
9మందికి పైగా 500 మార్కులు
100 శాతం విద్యార్థులు పాస్
కూసుమంచి , ఏప్రిల్ 30 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుదవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కూసుమంచి మండల కేంద్రంలోనీ గ్లోబల్ రెయిన్బో పాఠశాల ప్రభంజనం సృష్టించింది. డివిజన్ లోనే ప్రథమ స్థానం, జిల్లాలో రెండో స్థానం నిలిచి సత్తా చాటింది. మండలంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా నిలిచింది.. పాఠశాలకు చెందిన వాచేపల్లి భువన శ్రీకి(గట్టుసింగారం) 584 మార్కులు సాధించింది.
వరుసగా సీహెచ్ శ్రీజ 556(జీళ్ళచెరువు), వీ శిరీష 543(గట్టసింగారం), గార్లపాటి శివాణి 541(చౌటపల్లి), ఎండీ అస్మ షాగుప్త530(కూసుమంచి), ఎం కీర్తి 525(పోచారం), వీ చత్రపతి 523(కొత్త తండా),బీ శ్యామ్ 515(చేగొమ్మ), పీ ఉదయ్ 501(మంగళితండా) మార్కులు సాధించారని పాఠశాల కరెస్పాండెంట్ ఎండి ఎర్షాద్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బాణా సంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
కరస్పాడెంట్ మహ్మద్ ఎర్షాద్ అహ్మద్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాపించిన దగ్గరనుంచి విజయాల పరంపర కొనసాగుతుందన్నారు. ఈ ఘనత సాధించడానికి కారణం విద్యా ప్రణాళిక,ఉత్తమ ఉపాధ్యాయ బృందమన్నారు. విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.