గ్లోమీ స్మార్ట్ హెల్మెట్ అండ్ షూ డిస్ఇన్ఫెక్షన్ మెషీన్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 27(విజయక్రాంతి): రోజువారీ వినియోగ వస్తువులకు స్మార్ట్ డిస్ఇన్ఫెక్షన్ సొల్యూషన్స్ అందించడంపై దృష్టి సారించిన తెలంగాణకు చెందిన హైజీన్ టెక్నాలజీ సంస్థ స్మార్ట్ ఇండియా, హెల్మెట్లు, షూల కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్లతో రూపొందించిన గ్లోమీ స్మార్ట్ హెల్మెట్ అండ్ షూ డిస్ఇన్ఫెక్షన్ మెషీన్ను గురువారం హైదరాబాద్లో ప్రారంభించింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్లోని భారత్ పెట్రోలియం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఏసీపీ హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సీఐ (ట్రాఫిక్)రవీందర్, అడిషనల్ సీఐ శేఖర్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. రోజువారీగా ప్రజలు వినియోగించే ప్రదేశాల్లో ప్రొఫెషనల్ హైజీన్, డిస్ఇన్ఫెక్షన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంలో ఈ ఆవిష్కరణ కీలక ముందడుగుగా నిలుస్తుంది. కొత్తగా ఆవిష్కరించిన గ్లోమీ స్మార్ట్ హెల్మెట్ అండ్ షూ డిస్ఇన్ఫెక్షన్ మెషీన్ ఒకే మెషీన్లో హెల్మెట్, షూ రెండింటినీ శుభ్రపరిచి డిస్ఇన్ఫెక్ట్ చేసే విధంగా రూపొందించబడింది.
ఇందులో హెల్మెట్, షూల కోసం రెండు ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆటోమేటెడ్ మల్టీ-స్టేజ్ హైజీన్ సైకిల్లో భాగంగా యూవీ-సీ, ఓజోన్, స్టీమ్తో పాటు డియోడరైజేషన్, డ్రైయింగ్, కూలింగ్ వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. ఈ సందర్భంగా గ్లోమీ స్మార్ట్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రమోద్ గుండ్ల మాట్లాడుతూ స్మార్ట్ హైజీన్ను ప్రజల రోజువారీ జీవితంలో సులభంగా అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం. గ్లో మీ స్మార్ట్ హెల్మెట్ అండ్ షూ డిస్ఇన్ఫెక్షన్ మెషీన్ ద్వారా సాధారణంగా నిర్లక్ష్యం చేసే ఒక ముఖ్యమైన హైజీన్ అవసరానికి పరిష్కారం అందిస్తున్నాం.
తెలంగాణ నుంచి ఈ ప్రయాణాన్ని ప్రారంభించి, మా మేడ్-ఇన్-ఇండియా ఆవిష్కరణను దేశవ్యాప్తంగా, భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడం మాకు గర్వంగా ఉంది అన్నారు. హైదరాబాద్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం స్మార్ట్ హైజీన్ టెక్నాలజీలో కొత్త విభాగాన్ని సృష్టించాలనే గ్లోమీ స్మార్ట్ విస్తృత దృష్టికి నాంది పలికింది. తెలంగాణను ప్రారంభ కేంద్రంగా చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.






