calender_icon.png 30 June, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులకు హాని కలిగించే జిఓ 49 రద్దు చేయాలి

29-06-2025 06:59:25 PM

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం...

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్..

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మే 30న తడోబా అందేరి రిజర్వ్ ఫారెస్ట్ కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్(Tadoba Andhari Reserve Forest Qawwal Reserve Forest)లో కలుపుతూ కుమ్రం భీం జిల్లాలోని కాగజ్నగర్-ఆసిఫాబాద్ పరిధిలో 334 గ్రామాలను పేర్కొంటూ తీసుకొచ్చిన "జి.ఓ నెం.49 కుమ్రం భీం కన్జర్వేషన్ రిజర్వ్" ప్రాజెక్ట్ను రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(TAGS)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్(State Chief Secretary Poosam Sachin) డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో సంఘం కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశంతో డసం శంభు(TAGS) జిల్లా కార్యదర్శి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉంది.

ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామ సభ, పెసా లాంటి గిరిజన చట్టాలను అమలు పర్చకుండా ఈ గ్రామాల్లో ఎలాంటి సభలు నిర్వహించకుండా ప్రజాభిప్రాయలు తీసుకోకుండా జి.ఓ తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆవలంబిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం సిగ్గుచేటు, పులుల సంరక్షణ, అడవుల సంరక్షణ పేరుతో అడవిని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి ఆదివాసీలను అడవులకు దూరం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికే ఈ రిజర్వ్ ఫారెస్ట్ చేపడుతున్న సందర్భంగా ప్రభుత్వం నుండి మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు, త్రీ ఫేజ్ కరెంట్, ఇతర సదుపాయాలు అన్ని ఫారెస్ట్ అధికారులు ఆపేసారు.

ఈ జి.ఓ.నెం. 49 ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉన్నందున ఈ జి.ఓ. 49ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఆదివాసీ గ్రామాల్లో ప్రభుత్వం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కతలే లక్ష్మణ్, దుప్పిపోశెట్టి, టేకం ధర్మరాజు, పంద్రం ఆనందరావు, కథలే లింభారావు తదితరులు ఉన్నారు.