09-12-2025 12:11:46 AM
లక్షేట్టిపేట టౌన్, డిసెంబర్ 8 : ఈ నెల ఐదు నుంచి ఏడవ తేదీ వరకు హైదరాబాద్ లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో పట్టణంలోని మహాత్మ జ్యోతి బాపూలే పాఠశాల విద్యార్థి జస్వంత్ బంగారు పథకం సాధించాడని ప్రిన్సిపాల్ మంగ సోమ వారం తెలిపారు. జస్వంత్ ను అండర్ 19 సెక్రెటరీ బాబురావు, ఏటీపీ తిరుమల, పిడి నాంపల్లి, పీఈటి రాజేష్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.