09-12-2025 12:10:15 AM
నస్పూర్, డిసెంబర్ 8 : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈ వీ ఎం) భద్రపరిచిన నస్పూర్ లోని గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించి, బందోబస్తు ఏర్పా ట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు చేపట్టడంతో పాటు 24 గంటలు సి.సి. కెమెరాల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. భద్రత సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, గుర్తింపు పొం దిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.