ఆకాల వర్షంతో వరి పంట నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
- బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ,(విజయక్రాంతి): అకాల వర్షంతో వరి పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కొండమల్లెపల్లి మండలం చెన్నారం గ్రామంలో అకాల వర్షంతో వరి పంట ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్ట పరిహారం అందించాలని ఆయన కోరారు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు అందించాలని ఆయన కోరారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం జరిగింది అని ఆయన గుర్తు చేశారు. రైతులకు బిఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,రైతులు తదితరులు ఉన్నారు.






