16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

మొంథా తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

29-10-2025 02:05 PM

మఠంపల్లి: సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలో అకాల మొంథా తుఫాన్ కారణంగా మఠంపల్లి మండలంలో తుఫాన్ తీవ్రత వల్ల పంట నేలాకోరగడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గిరిజన శక్తి సంఘం జిల్లా అధ్యక్షుడు ధరవతు బాలకృష్ణ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నేలాకోరిగిన వరి పొలాలను పరిశీలించి ఆయన మాట్లాడారు. ఇప్పటికే వరి పంటకు ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతన్నలు వరి కోత దశలో ఉండగా తుఫాన్ తీవ్రరూపం దాల్చడంతో తీవ్రమైన పంట నష్టాన్ని  ప్రభుత్వం భరించి రైతులకు వెంటనే ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించి ప్రభుత్వం రైతులపై తన ఉధారాబావాన్ని చూపి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ విషయంపై మండల ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని రైతులను ఆదుకునే దిశగా వరి పంట నష్టాని అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలని కోరారు.