జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అక్టోబర్ 31 నుండి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో తొమ్మిది రోజుల పాటు విస్తృత ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నవంబర్ 9న షేక్పేట నుండి బోరబండ వరకు భారీ బైక్ ర్యాలీతో ప్రచారం ముగుస్తుంది. ప్రచారంలో భాగంగా, కేటీఆర్(Kalvakuntla Taraka Rama Ra) అక్టోబర్ 31 న షేక్పేట్తో ప్రారంభమై, రెహ్మత్ నగర్ (నవంబర్ 1), యూసుఫ్గూడ (నవంబర్ 2), బోరబండ (నవంబర్ 3), సోమాజిగూడ (నవంబర్ 4), వెంకట్రావ్ నగర్ (నవంబర్ 5) (నవంబర్ 6) కీలక ప్రాంతాలలో వరుస రోడ్షోలు నిర్వహిస్తారు.
నవంబర్ 8న ఆయన షేక్పేట్, యూసుఫ్గూడ, రెహమత్ నగర్ డివిజన్లకు తిరిగి వచ్చి, నివాసితులు, స్థానిక నాయకులతో సంభాషిస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో జెండా పాతాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతున్నాయి. మరి బీఆర్ఎస్ తన స్థానాన్ని గెలుస్తుందా లేదా చూడాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ లో 300 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది బీఆర్ఎస్ కు భారీ షాక్ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.






