17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మెంథాన్ తుఫాన్ తో రైతన్న విలవిల

29-10-2025 03:03 PM

- ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వందల ఎకరాలలో వరి పైరు నేలకొరిగి నీట మునిగింది

- వరికంకి పాలు పోసుకొని ధాన్యంగా మారే కీలక దశలో వరి పొలాలు నేలకొరిగి నీట మునగడం తో రైతన్న వెన్నుపూస విరిగినట్లు అయింది

హుజూర్ నగర్: మెంథాన్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని అనేక గ్రామాలలో వందల ఎకరాలలో వరి పైరు నేలకొరిగి నీట మునిగింది. వరికంకి పాలు పోసుకొని ధాన్యంగా తయారు కాబోతున్న ఈ కీలక దశలో వరి పొలాలు నేలకొరిగి నీట మునగడం తో రైతన్న వెన్నుపూస విరిగినట్లు అయింది. మండలంలోని వివిధ గ్రామాలలో గల చెరువులు, బావులు, వాగులు, వంకలు, బోర్లు అన్ని నీటితో నిండి ఏ క్షణానైనా కట్టెలు తెంచుకునే ప్రమాదాన్ని పొంచి ఉన్నాయి. దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో పలు రైతుల వరి పంట నీట మునిగి తీవ్ర నష్టాన్ని  కలిగించటంతో వారు ఆవేదన చెందారు. మండలంలోని వివిధ గ్రామాలలో ఎంత మేరకు వరి పంటకు నష్టం, నివాస గృహాలకు నష్టం వాటిల్లింది అనే సమాచారం అధికారుల నుంచి తెయాల్సి ఉంది.