1 July, 2026 | 6:41 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

అధికారులు అనర్హులను గుర్తిస్తే తగిన మూల్యం తప్పదు

11-05-2025 08:39 PM

యువత మొత్తం పదార్థాలకు బానిసలవుతున్నారు

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురజా రామచంద్రం, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు

మునుగోడు,(విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని, అధికారులు అనరులను గుర్తిస్తే తగిన మూల్యం తప్పదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురిజా రామచంద్రం అన్నారు. శనివారం రాత్రి పలివెల గ్రామ శాఖ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదటగా బస్టాండ్ సెంటర్లో గల పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురిజా రామచంద్రం మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం సిపిఐ పోరాడుతుందన్నారు. నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు,పెన్షన్లు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు.

సంక్షేమ పథకాల ఎంపికలో అధికారులు అనరులను గుర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పార్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో యువత గంజాయి కొకైన్ లాంటి మత్తు మత్తుకు బానిస అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వీటిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. నాతి నరసింహ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో మాజీ జడ్పిటిసి గోస్కొండ లింగయ్య, మాజీ ఎంపీపీ మాధగోని సాయిలు,గ్రామ శాఖ కార్యదర్శి గోల్కొండ కృష్ణయ్య, సహాయ కార్యదర్శి ఆనగంటి నరసింహ, వరికుప్పల వెంకన్న, మాధగోని మల్లయ్య, గోస్కొండ మల్లేష్, మోహన్ రెడ్డి, పంతంగి నరసింహ, యాదయ్య, కృష్ణయ్య, రాములు, రాజు, దశరథ ఉన్నారు.