29-12-2025 12:00:00 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం
బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్
తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ
ముషీరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వే షన్ల కోసం అన్ని కుల, బీసీ, ఉద్యోగ, ప్రజా, న్యాయ, విద్యార్థి సంఘాలు ఒకే తాటిపైకి రావాలని పిలుపు నిచ్చారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఒక్క పార్లమెంట్ సభ్యుడితో కొట్లాడి రాష్ట్రాన్ని తీసు కొస్తే, వందల మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని ధ్వజమెత్తా రు. తెలంగాణ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట తప్పి మోసం చేసిందన్నారు. రాబోయే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాకే జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, ఉదయ్, జయంతి తదితరులు పాల్గొన్నారు.