31-05-2025 12:00:00 AM
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్ కుమార్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 30 ( విజ యక్రాంతి): కార్మికుల హక్కులను ప్రభుత్వా లు కాలరాస్తున్నాయని తెలంగాణ వ్యవసా య కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుమేరకు శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో కలసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు కనీస సదుపాయాలు కల్పించాలని, బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన ప్రతి పత్రాన్ని కలెక్టర్ వెంకటేష్ దోత్రే, గ్రామీణాభివృద్ధి అధికారి దత్తరావులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శు లు టీకానంద్ ,కార్తీక్, టిఎజిఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బక్కన్న నాయకులు తిరుపతి, శ్రీకాంత్, స్రవంతి, రాజ్ కుమార్, సందీప్, శంకర్, కార్మికులు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.