calender_icon.png 4 June, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ జోన్ కార్పొరేటర్ల సమావేశం

31-05-2025 12:00:00 AM

- వానకాలంలో తీసుకోవల్సిన జగ్రత్తలపై చర్చ

హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కార్పొరేటర్లతో వానకాల అత్యవసర సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

అధికారులు, కార్పొరేటర్లు వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమస్యలు వివరించారు. అత్యవసర రోడ్ల మరమ్మత్తు, ప్రాధాన్యత, నాళాల వద్ద పరిశు భ్రత తదితర అంశాలపై చర్చించారు. డిప్యూటీ మేయర్ క్రమశిక్షణతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు.

లోతట్టు ప్రాం తాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న నాలా పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.