calender_icon.png 20 December, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మానేరుపై మరో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

20-12-2025 09:33:18 PM

ఆరెంద మీదుగా దామెరకుంట వరకు హై లెవెల్ బ్రిడ్జి

ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుండి బ్రిడ్జి వరకు అటు సైడు దామరకుంట రోడ్డు వరకు 9.530 మీటర్ల అప్రోచ్ రోడ్డు కమ్ రోడ్డు

ఆర్ అండ్ బి శాఖ నుంచి రూ. 203 కోట్ల  నిధులు మంజూరు

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వెల్లడి

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 మీటర్ల పొడవు 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి.. ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుండి బ్రిడ్జి వరకు అటు సైడు దామేరకుంట రోడ్డు వరకు  9.530 మీటర్ల అప్రోచ్ రోడ్డుకు రూ.203 కోట్ల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్ బి శాఖ నుంచి నిధులు మంజూరు చేశామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు.  పెద్దపల్లి జిల్లా, మంథని మండల ప్రజలు, ఇతర మండలాల ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాలకు, మహారాష్ట్రకు, కాళేశ్వరం దేవాలయానికి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి, ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి వీలుగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని సంకల్పించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి మంత్రి శ్రీధర్ బాబు ఆరెంద మీదుగా దామెరకుంట వరకు ఆర్ అండ్ బి శాఖ నుండి రూ. 203 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు. 

ఈ బ్రిడ్జి నిర్మాణం వలన మంథని, పెద్దపల్లి జిల్లా ప్రజలకు కాళేశ్వరం వెళ్ళడానికి 25 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుందని, కాళేశ్వరం టూరిజం డెవలప్మెంట్ కూడా పెరుగుతుందని, మహారాష్ట్ర తో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి చాలా వీలు ఉంటుందని, జయశంకర్ భూపాలపల్లి, కాటారం వెళ్లడానికి వీలు ఉంటుందని, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్, దామేరకుంట ఈ గ్రామాలలో ప్రజలకు రవాణా పరంగా మరియు  వైద్య, విద్య పరంగా చాలా ఉపయోగపడుతుందని, పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కు మెరుగైన రావాణా సౌకర్యం పెరుగుతుందని, మానేరు పై బ్రిడ్జి అరెంద మీదుగా దామెర కుంట నిర్మాణానికి రూ. 203 కోట్ల నిధులు మంజూరు చేయించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకి పెద్దపల్లి జిల్లా ప్రజలు, మంథని మండల ప్రజలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు, అరెంద, మల్లారం, వెంకటాపూర్, దామరకుంట గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.