22 June, 2026 | 3:17 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

20-12-2025 09:27 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): జిల్లాలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నదీమ్ లతో కలిసి తహసిల్దార్లు, చర్చ్ ల ఫాదర్లు, సంబంధిత శాఖల అధికారులతో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన క్రిస్మస్ వేడుకలను శాంతియుత వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతి రిజిస్టర్డ్ చర్చ్ కు సున్నం, విద్యుత్ దీపాల కొరకు రూ.30 వేలను అందిస్తుందని తెలిపారు.

సిర్పూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్, కౌటాల, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, రెబ్బెన లలో 4 చోట్ల వేడుకలను నిర్వహించేందుకు 4 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, ఈ నీతులను సంబంధిత తహసీల్దారుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్ నగర్, కౌటాల తహసీల్దారు, చర్చ్ ల ఫాదర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.