calender_icon.png 12 December, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలి

08-12-2025 12:49:04 AM

తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 7 (విజయక్రాంతి):  వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తహసీల్దార్ బాషపాక శ్రీకాంత్ నిర్వాహకులకు సూచించారు.ఆదివారం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంటాలైన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు.రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర చెల్లింపులను ఆలస్యం చేయకుండా వెంటనే జమ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దేవరకొండ విజయ,నిమ్మల నాగమ్మ,రైతులు,హమాలీలు తదితరులు పాల్గొన్నారు.