08-12-2025 12:47:38 AM
చిట్యాల, డిసెంబర్ 7(విజయ క్రాంతి): చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేసి పట్టణ ప్రజల సమస్యలను తీర్చాలని కోరుతూ బిజెపి పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నల్గొండ కేంద్రంలో వినతిపత్రం అందజేశారు.
జాతీయ రహదారి 65 పై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నప్పటికీ నెమ్మదిగా సాగుతుండడం వల్ల పట్టణ ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పనులను వేగవంతం చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కన్నెబోయిన మాలింగం, శీను, కన్నెబోయిన మురళీకృష్ణ, తదితరు నాయకులు ఉన్నారు.