ధాన్యం బస్తాలకు అంటుకున్న నిప్పు

29-04-2024 01:53:07 AM

మంచిర్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండ లం శాంతాపూర్ వద్ద వరి ధాన్యం బస్తాలతో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు విద్యు త్ తీగలు తగిలి నిప్పురవ్వలు ధాన్యం బస్తాలపై పడటంతో మంటలంటున్నాయి. స్థానిక రైతులు గమనించి లారీని నిలిపి మంటలను నీళ్లు చల్లి ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దాదాపు 20 నుంచి 30 బస్తాల ధాన్యానికి నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. ప్రమాదంపై స్పందించిన అదనపు కలెక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని ‘విజయక్రాంతి’కి తెలిపారు.