కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలి

29-04-2024 01:51:56 AM

ఖమ్మం పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఈ నెల 30న కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారని, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొ ని జయప్రదం చేయాలని ఖమ్మం పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు కోరారు. పాల్వంచలోని గట్టాయిగూడెంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కిలారు నాగేశ్వరరావు నివాసంలో ఆదివా రం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి వన మా వెంకటేశ్వరరావు, నాయకులు వెంకటరమణ, కిలారు నాగేశ్వరరావు, కాంపెల్లి కనకేష్, కనగాల బాలకృష్ణ, డిష్ నాయు డు, మేదరమెట్ల వెంకటేశ్వర్లు తదితరలు పాల్గొన్నారు.