ఘనంగా రథోత్సవం

26-04-2024 12:10:00 AM

సిద్దిపేట, ఏప్రిల్ 25 (విజయక్రాం తి) : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం గురువారం కన్ను ల పండువగా జరిగింది. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల య వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం స్వామివారిని పుష్పరథం పై గ్రామంలో ఊరేగించారు. బెజ్జంకి మండలంతో పాటు సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి రథోత్సవానికి హాజరయ్యారు.