10-01-2026 09:45:39 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్బంగా మేడిపల్లి సాయి హిల్స్ కాలనీ అశోషియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మహిళ లు ఉత్సాహంగా పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డిపాల్గొని బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి నళిని, రెండవ బహుమతి ప్రీతి, మూడవ బహుమతి రవలి,నాల్గవ బహుమతి అరుణ కు ముగ్గుల పోటిల్లో పాల్గొన్నా మహిళలందరికి బహుమతులు అందించారు.