భూగర్భ జలాలను పొదుపుగా వాడాలి
25-03-2026 01:54 AM
నిర్మల్, మార్చి 2౪ (విజయక్రాంతి): జలం జీవకోటి ఆధారమని ఆ జలాన్ని పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా భూగర్భ జల శాఖ అధికారి ఇన్చార్జ్ డిడి శ్రీనివాస్ బాబు అన్నారు. మామడ మండలము లోని బండల్ ఖానాపూర్ గ్రామం నందు భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో అవల్ రూరల్ లైవిలిహుడ్ ఎంపవర్ మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమము లో వ్యవసాయ మరియు పరిశ్రమల శాఖ ద్వారా నీటి పొదుపు పద్ధతులు పాటించినందున వారిని సత్కరించడం అయినది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో ఏపీఓ, మత్చ్య శాఖ, సర్పంచ్, గ్రామ సర్పంచ్ అధికారులు పాల్గొన్నారు.




