8 April, 2026 | 3:28 PM

ఏసీబీకి చిక్కిన ఇన్‌చార్జి ఎంఈఓ

08-04-2026 01:30 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల ఇన్చార్జి ఎంఈఓ, అయోధ్య పురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(Zilla Parishad Secondary School) హెడ్మాస్టర్ రవికుమార్, సహచర ఉపాధ్యాయుడు చంద్రమౌళి కలిసి ఉపాధ్యాయుడి వద్ద 15 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే మండలంలోని ఓ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పదవి విరమణ చేసిన ఫైల్ పై సంతకాలు చేయడానికి 15,000 రూపాయలను డిమాండ్ చేసి అవి ఇస్తేనే సంతకం పెడతానని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.