ఏఎంసీ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన గుండాటి గోపిక జితేందర్ రెడ్డి
జీవన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు ‘విజయక్రాంతి‘తో వెల్లడి
ధర్మపురి, మార్చి25(విజయక్రాంతి): మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా సెగలు వెల్గటూర్ మండలాన్ని సైతం తాకా యి. కార్యకర్తల నుండి మొదలుకొని పదవిలో ఉన్నవారు సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బా టలో పయనిస్తున్నారు. జగిత్యా ల జిల్లాలో బుధవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పా ర్టీకి రాజీనామా చేయగానే వెంటనే వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి లు తమ చైర్ పర్సన్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
తమకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని అభిమానం ఉన్నప్పటికీ, తమకు రాజకీయ గురువు అయినటువంటి జీవన్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీలో తాము సైతం ఉండలేమంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఇన్నేళ్లు తమకు సహకరించిన కార్యకర్తలకు,పార్టీ విధేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుండి కష్టమైన,నష్టమైన జీవన్ రెడ్డి బాటలోనే తాము నడవనున్నట్లు ఏఎంసి చైర్ పర్సన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి ఈ సందర్భంగా ‘విజయక్రాంతి‘తో వెల్లడించారు.




