మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్లో సిద్ధార్థ విద్యార్థులకు పతకాలు
26-03-2026 01:09 AM
ముకరంపుర, మార్చి 25 (విజయక్రాంతి): నగరంలోని భగత్నగర్లోని సిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలంపియాడ్ వారు నిర్వహించిన మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్ లో పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో పాఠశాలకు చెందిన డి. హశ్విత్ కుమార్ 3వ స్థానం, కె. దివ్య 4వ స్థానం, ఎస్. హరిచందన 5వ స్థానంలో ఉత్తీర్ణత సాధించి బంగారు పతకము, ప్రశంసా పత్రాన్ని గెలుపొందారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ స్వప్న శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.




